సందీప్ కిషన్ హీరోగా నటించిన పాత సినిమా '' డీకే బోస్ '' ఇన్నాళ్ల తర్వాత కరోనా పుణ్యమా అని రిలీజ్ కి సిద్ధమైంది. రిలీజ్ అనగానే థియేటర్ లో అనుకోవద్దు ..... డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది డీకే బోస్ చిత్రం. ఈ చిత్రం ఇప్పటిది కాదు సుమా ...... 2013 నాటి సినిమా. అంటే ఏడేళ్ల క్రితం సినిమా అన్నమాట. అపుడెపుడో రిలీస్ కావాల్సిన ఈ సినిమని బయ్యర్లు కొనలేదు అలాగే రిలీజ్ కి చాలా ఇబ్బంది పడ్డారు.దాంతో చాలాకాలంగా మూలకు ఉన్న ఈ సినిమా కరోనా పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సందీప్ కిషన్ హీరోగా పరిచయమై పదేళ్లు దాటిపోయింది కానీ సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు దాంతో ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు పాపం.
Read Moreమెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ లలో కూడా నటించాలని ఆసక్తి చూపిస్తున్నాడట. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి యువత ఎక్కువగా అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లలో కాలం గడుపుతున్నారు అందువల్ల అలాంటి ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలంటే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ వస్తే అందులో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట చిరు.దాంతో ఓ ముగ్గురు నలుగురు దర్శకులతో పాటుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయాలనీ చూస్తోందట. ఇక ఈ వెబ్ సిరీస్ ని అగ్ర నిర్మాత చిరు బావమరిది అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అరవింద్ '' ఆహా '' అనే ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసాడు. అది అంతగా క్లిక్ అవ్వలేదు దాంతో దాన్ని అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా చేయడానికి ఇలా మాస్టర్ ప్లాన్ వేసాడట.
Read More